మనసు బాగాలేనప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏం తోచదు. అలాంటప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో కొంచెం సేపు గడిపితే రిలీఫ్గా అనిపిస్తుంది. దీన్నే ‘వెల్నెస్ టూరిజం’ అని పిలుస్తున్నారు. ఈ కరోనా కాలంలో చాలామంది వెల్నెస్ టూర్లకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్గా రిలాక్స్ అయ్యేందుకు వెల్నెస్ హాలిడేస్కి వెళ్తున్నారు. మెంటల్ హెల్త్, ఇమ్యూనిటీ మీద ఫోకస్ చేయడం కూడా అందుకు ఒక కారణం అంటున్నారు ట్రావెల్ కంపెనీ యజమానులు.
ప్రశాంతత కోసం ప్రకృతి అందాలకు నెలవైన ప్లేస్లకి వెళ్తున్నారు కొందరు. మరికొందరు పర్వత ప్రాంతాల్లో ధ్యానం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒంటరిగా గడిపేందుకు, మెంటల్గా స్ట్రాంగ్ అయ్యేందుకు యోగా, ధ్యానం చేస్తున్నారు కొందరు. యంగ్స్టర్స్లో చాలామంది పెండ్లికి ముందు 15 రోజులు లేదా నెలంతా యోగా సెంటర్ల బాట పడుతున్నారని అంటోంది ఢిల్లీకి చెందిన ఒక ట్రావెల్ కంపెనీ డైరెక్టర్ నేహ ప్రణయ్నాథ్. టూరిస్ట్ల ఛాయిస్లని బట్టి పాపులర్ టూరిస్ట్ ప్లేస్లోని హోటల్స్, రిసార్ట్స్లు వెల్నెస్ ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. వెల్నెస్ టూర్లలో భాగంగా ఎక్కువమంది వెళ్తున్న ప్లేస్లలో డెహ్రాడూన్, కేరళ, రిషికేశ్, కోయంబత్తూర్, కూర్గ్ వంటివి టాప్లో ఉన్నాయి. కిందటి ఏడాది కంటే ఈ ఏడాది వెల్నెస్ టూరిజం పెరగనుందని అంచనా. గ్లోబల్ వెల్నెస్ ఇనిస్టిట్యూట్ పోయిన ఏడాది రిపోర్టులో 2022లో వెల్నెస్ టూరిజం 7.5శాతం పెరుగుతుందని చెప్పింది.
వెల్నెస్ ప్యాకేజెస్
‘‘ కేరళలోని చాలా టూరిస్ట్ ప్లేస్లు వెల్నెస్ టూరిజంకు ఫేమస్. టూరిస్ట్లు సెలక్ట్ చేసుకునే ప్లేస్ని బట్టి ధర ఉంటుంది. కొన్ని హోటల్స్ వారం నుంచి పది రోజులకి రూ.15 నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నాయి. స్పెషల్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసే లగ్జరీ రిసార్టులు రోజుకి రూ.25 నుంచి 50 వేల వరకు ఛార్జ్ చేస్తాయి” అని చెప్తోంది నేహ.