కేసీఆర్ తెలంగాణకు పరాయివాడు..కిరాయివాడు : రేవంత్

కేసీఆర్ తెలంగాణకు పరాయివాడు..కిరాయివాడు : రేవంత్

35వేల కోట్ల పంచాయతీ నిధులను కేసీఆర్ దొంగలించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొల్లగొట్టిన నిధులతో మేఘా, ప్రతిమ సంస్థలకు బిల్లులు కడుతున్నారని మండిపడ్డారు. సర్పంచుల ఖాతాల్లో వెంటనే నిధులను జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు తెలంగాణతో టీఆర్ఎస్కు పేరుబంధం ఉండేదని.. పార్టీ పేరు మార్పుతో పేగు బంధం తెగిపోయిందన్నారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణకు పరాయివాడు, కిరాయివాడు అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో బీహార్ అధికారుల రాజ్యం నడుస్తోందని రేవంత్ అన్నారు. కేసీఆర్ కు కాలం చెల్లిపోయిందని.. ఇంకో ఐదారు నెలలు మాత్రమే అధికారంలో ఉంటారన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. గ్రామపంచాయతీలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని.. పంచాయతీ నిధులు పంచాయతీలకు ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్ ఒక దొంగ అని..ఆయన్ని జైల్లో పెట్టాలన్నారు. నిధులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

నిధుల కోసం సర్పంచులు బిచ్చమెత్తుకుంటున్నారని రేవంత్ చెప్పారు. పారిశుధ్య కార్మికులకు చెల్లాంచాల్సిన జీతాలు కూడా చెల్లించడం లేదని మండిడపడ్డారు.కేసీఆర్ పంచాయతీ రాజ్ వ్యవస్థను కూప్పకూల్చారని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని.. సర్పంచులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఆత్మహత్యలకు పాల్పడ్డ సర్పంచుల కుటుంబాలను ఆదుకోవాలి