‘బీఆర్ఎస్​ వాగ్దానాలన్నీ బోగస్’

‘బీఆర్ఎస్​ వాగ్దానాలన్నీ బోగస్’

జడ్చర్ల టౌన్, వెలుగు : ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్​ బోగస్ వాగ్దానాలు ఇస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్​రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సభ జరిగిన మరుసటి రోజే నియోజకవర్గంలోని మిడ్జిల్, రాణిపేట్, నవాబుపేట, బాలానగర్, జడ్చర్ల మండలాలకు చెందిన 2 వేల మంది కాంగ్రెస్  పార్టీలో చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. గురువారం పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ జడ్చర్ల సభలో సమస్యలు లేవన్నట్లు రెండు పోలీస్ స్టేషన్లు, ఒక బైపాస్  అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

బైపాస్  రోడ్డు కావాలంటున్న లక్ష్మారెడ్డి అక్కడ భూములు కొన్నారా? అని ప్రశ్నించారు. జడ్చర్ల అభివృద్ధి పూర్తిగా కుంటుబడిందని, రాష్ట్రంలో రౌడీ రాజ్యం కొనసాగుతుందన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోను బీఆర్ఎస్  కాపీ కొట్టిందన్నారు. కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీ స్కీమ్​లను అమలు చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్  పార్టీ వైపు ఉన్నారని తెలిపారు. అంతకుముందు నెక్కొండ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 600 మంది కాంగ్రెస్ లో చేరారు.