
ఇంద్రవెల్లి,(ఉట్నూర్) వెలుగు: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ స్కూళ్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను కోరారు.
శుక్రవారం హైదరాబాద్లోని చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి వినపత్రం అందజేశారు. గత 10 నెలలుగా బకాయిలు ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న క్యాటరింగ్ విధానాన్ని రద్దు చేసి, జీవో 60 ప్రకారం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో వేతనాలు చెల్లించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ...సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు సుగుణ తెలిపారు.