ఏసీబీకి పట్టుబడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

ఏసీబీకి పట్టుబడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
  • డ్రంకెన్ డ్రైవ్ కేసులో బైక్​ ఇచ్చేందుకు రూ. 5 వేలు లంచం డిమాండ్ 

బషీర్​బాగ్, వెలుగు:  డ్రంకెన్​ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో సీజ్ చేసిన బైక్ ఇచ్చేందుకు రూ. 5  వేలు లంచం తీసుకుంటూ నారాయణగూడ ట్రాఫిక్ కానిస్టేబుల్ వికాస్ కుమార్ యాదవ్ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు.  ఏసీబీ అధికారులు తెలిపిన మేరకు..  టోలిచౌకి ప్రాంతానికి చెందిన రంజాన్ డ్రంకెన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు.

 కౌన్సెలింగ్  అనంతరం బైక్ తీసుకొనేందుకు అతడి ఫ్రెండ్ మహ్మద్ ఖాజా హబీబుద్దీన్​తో కలిసి నారాయణగూడ ట్రాఫిక్ పీఎస్​కు వచ్చాడు. బైక్ రిలీజ్ చేయాలంటే రూ. 5 వేలు ఇవ్వాలని కోర్టు కానిస్టేబుల్ వికాస్ కుమార్ డిమాండ్ చేశాడు.  బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.  మంగళవారం నారాయణగూడ ట్రాఫిక్ పీఎస్​లో ఖాజా హబీబుద్దీన్ నుంచి  లంచం తీసుకుంటున్న వికాస్​ కుమార్​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.