బైక్‌పై వెళ్తూ కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణం పోసిన ట్రాఫిక్‌ పోలీస్‌

బైక్‌పై వెళ్తూ కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణం పోసిన ట్రాఫిక్‌ పోలీస్‌

వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన రాజు అనే వ్యక్తి బైక్‌పైన వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అలంకార్‌ జంక్షన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా.. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ స్వామి వెంటనే స్పందించి రాజుకి గుండెపోటు వచ్చినట్టు గుర్తించాడు. ఆలస్యం చేయకుండా వెంటనే సీపీఆర్‌ చేశాడు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రికి తలరించారు. దాంతో రాజు ప్రాణాలతో బయటపడ్డాడు. 

గుండెపోటుకు గురైన రాజు స్థానిక రేషన్‌ షాపు డీలర్‌గా గుర్తించారు. సీపీఆర్‌ ద్వారా అతని ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ స్వామిని సిటీ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ అభినందించారు. CPR పట్ల పోలీస్ సిబ్బందికి సీపీ ఇప్పించిన శిక్షణ సత్పలితాలిస్తుండడంతో ప్రశంసలు కురిపించారు.