కేటీఆర్ పర్యటనతో ఎల్​బీనగర్​లో ట్రాఫిక్ జామ్

కేటీఆర్ పర్యటనతో ఎల్​బీనగర్​లో ట్రాఫిక్ జామ్

అరగంట ముందే వెహికల్స్​ను నిలిపేసిన పోలీసులు

ఎల్​బీనగర్, వెలుగు: మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఎల్​బీనగర్ సెగ్మెంట్​లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం కేటీఆర్ పర్యటించిన ప్రాంతాల్లో పోలీసులు అరగంట ముందే వెహికల్స్​ను నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్​ఏర్పడింది. దీంతో డ్యూటీలు, ఇతర పనులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

మంత్రికి ఫ్రీ రూట్ ఇచ్చే 

టైమ్​లో జనాల ఇబ్బందులు కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు.

బీజేపీ వాల్​పోస్టర్స్ తొలగింపు  

కేటీఆర్ ​వెళ్లే మార్గంలో బీజేపీ స్టిక్కర్స్ కానీ, వాల్ పోస్టర్స్ ఉండకుండా జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందితో వాటిని తొలగించారు. బండి సంజయ్​ పాదయాత్రకు సంబంధించి గోడలపై ఉన్న పోస్టర్స్​ను తీసివేయించారు. మంత్రి కొద్ది సేపట్లో వస్తున్నాడనే సమయంలో హడావుడిగా వాటిని తొలగించారు.