అలర్ట్.. ఇవాళ్టితో ట్రాఫిక్‌‌‌‌ పెండింగ్ చలాన్స్‌‌‌‌ ఆఫర్ క్లోజ్

అలర్ట్..  ఇవాళ్టితో  ట్రాఫిక్‌‌‌‌ పెండింగ్ చలాన్స్‌‌‌‌ ఆఫర్ క్లోజ్
  • ఇప్పటిదాకా రూ.100 కోట్లు వసూలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ట్రాఫిక్‌‌‌‌ పెండింగ్ చలాన్స్‌‌‌‌ డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ బుధవారంతో ముగియనుంది. గత నెల 26న ప్రారంభమైన ఆఫర్‌‌‌‌‌‌‌‌కు వాహనదారుల నుంచి భారీ స్పందన వచ్చింది.దాదాపు 31.75 శాతం చలాన్స్ క్లియర్ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే సమయం ఉండడంతో వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల చలాన్స్ పెండింగ్‌‌‌‌లో ఉండగా.. మంగళవారం రాత్రి వరకు 1.14 కోట్ల పెండింగ్‌‌‌‌ చలాన్స్ క్లియర్ అయ్యాయి. ఫైన్ల రూపంలో మొత్తం 100 కోట్ల 5 లక్షల అమౌంట్ వసూలైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ లిమిట్స్​లోనే చలాన్స్‌‌‌‌ క్లియర్ అయ్యాయి. అవసరమైతే మరికొన్ని రోజులు ఆఫర్‌‌‌‌‌‌‌‌ కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.