- ఇప్పటిదాకా రూ.100 కోట్లు వసూలు
హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్ పెండింగ్ చలాన్స్ డిస్కౌంట్ ఆఫర్ బుధవారంతో ముగియనుంది. గత నెల 26న ప్రారంభమైన ఆఫర్కు వాహనదారుల నుంచి భారీ స్పందన వచ్చింది.దాదాపు 31.75 శాతం చలాన్స్ క్లియర్ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే సమయం ఉండడంతో వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల చలాన్స్ పెండింగ్లో ఉండగా.. మంగళవారం రాత్రి వరకు 1.14 కోట్ల పెండింగ్ చలాన్స్ క్లియర్ అయ్యాయి. ఫైన్ల రూపంలో మొత్తం 100 కోట్ల 5 లక్షల అమౌంట్ వసూలైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లోనే చలాన్స్ క్లియర్ అయ్యాయి. అవసరమైతే మరికొన్ని రోజులు ఆఫర్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.