హోలీ వేడుకల్లో విషాదం  వార్దా నదిలో నలుగురు యువకులు గల్లంతు

హోలీ వేడుకల్లో విషాదం  వార్దా నదిలో నలుగురు యువకులు గల్లంతు

 కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా:  హోలీ వేడుకలలో విషాదం చోటుచేసుకుంది. కౌటాల మండలం తాటిపల్లి సమీపంలోని వార్దా నదిలో ఈతకు వెళ్ళి నలుగురు యువకులు గల్లంతైయ్యారు. కౌటాల మండలం నదీమబాద్ కు చెందిన కమలాకర్(22), సంతోష్(25), ప్రవీణ్(23), సాయి(22) లు అనే యువకులు హోలీ వేడుకల తర్వాత స్నేహితులతో కలిసి స్నానం చేయడానికి వార్ధా నదికి వెళ్లారు. నలుగురు నదిలో కొట్టకుపోయారు. ఎంత వెతికినా వారి కనబడకపోయేసరికి ఫ్రెండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, రిస్య్కూ టీం అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చెపట్టారు. ఇంకా యువకుల ఆనవాలు లభించలేదు. పోలీసులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని యువకుల ఆచూకీ కోసం వెతుకుతున్నారు.