పాకిస్తాన్ వైమానిక దాడి.. ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లతో సహా ఎనిమిది మంది మృతి

పాకిస్తాన్ వైమానిక దాడి.. ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లతో సహా ఎనిమిది మంది మృతి

పాకిస్తాన్​ జరిపిన వైమానిక దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్​ కు చెందిన ముగ్గురు క్రికెటర్లు చనిపోయారు. శనివారం(అక్టోబర్​18) పాక్టికా ప్రావిన్స్​లో జరిగిన ఈ దాడుల్లో  ముగ్గురు క్లబ్​లెవెల్​ క్రికెటర్లతో సహా 8మంది మృతిచెందారు.  ఆటగాళ్లు కబీర్, సిబ్ఘతుల్లా ,హరూన్ తోపాటు మరో ఐదుగురు మృతిచెందినట్లు ఆఫ్ఘన్​ క్రికెట్​ బోర్డు ప్రకటించింది. శుక్రవారం(అక్టోబర్​17) మ్యాచ్​ లు ఆడి  షఠానా నుంచి ఆర్గాన్​ కు తిరిగి వెళ్తుండగా బాంబు దాడులో యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు.  ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.  

మరోవైపు పాకిస్తాన్​ తో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్యా పాకిసాన్​, శ్రీలంకతో రాబోయే సిరీస్​ నుంచి ఆఫ్ఘనిస్తాన్​ క్రికెట్​ బోర్డు (ACB) వైదొలిగింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని సరిహద్దు ప్రావిన్స్‌లో పాకిస్తాన్ తాగా దాడితో కాల్పుల విరమణను ఉల్లంఘించిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది.