
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో అల్లరి నరేష్ యాక్టింగ్, డైలాగ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.
ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. ఆనంది కథానాయిక నటిస్తోంది. జీ స్టూడియోస్ సమర్పణలో, హాస్య మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నవంబరు 25న గ్రాండ్ లెవెల్లో థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.