ఉత్తరప్రదేశ్లోని మధురలోని మధుర జంక్షన్లో షకుర్బస్తీ మధుర మెము (04446) రైలు ప్లాట్ఫారమ్పైకి దూసుకెళ్లిందని రైల్వే అధికారులు తెలిపారు. లోకో పైలట్లు, టీటీఈలు, రైలు గార్డుతో సహా ప్రయాణికులు, సిబ్బంది కూడా స్టేషన్లో అప్పటికే దిగడంతో ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
Also Read : టెట్ ఫలితాలు విడుదల
మెము (MEMU) ఉత్తర రైల్వేకు చెందింది. సెప్టెంబర్ 26న రాత్రి 10:48 గంటలకు మధుర జంక్షన్కు చేరుకుంది. "మెము ప్లాట్ఫారమ్ 2A వద్దకు చేరుకుంది. ఐదు నిమిషాల తర్వాత రైలు విద్యుత్ (OHE) స్తంభాన్ని బద్దలు కొట్టి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించింది, ప్లాట్ఫారమ్ను కూడా దెబ్బతీసింది" అని స్టేషన్కి సంబంధించిన ఎన్సీఆర్లోని ఆగ్రా డివిజన్కు చెందిన వర్గాలు తెలిపాయి.
Train Accident in Mathura, UP, a local train collided with the platform at Mathura Junction railway station. There is no information about any casualty. #TrainAccident #Mathura #MathuraJunction pic.twitter.com/DN3qFS4QnT
— Ujjwal?? (@U23337) September 27, 2023