
- గ్రేటర్ నోయిడాలో ఘటన
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఘోరం జరిగింది. ఓ ట్రైనీ డాక్టర్ 21వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మథురకు చెందిన శివ (29).. గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ2లో నివాసం ఉంటున్న తన సోదరి ఇంటికి వచ్చాడు.
మధ్యాహ్నం ఇంట్లో పేరెంట్స్ ఓ గదిలో ఉండగా.. శివ బాల్కనీలోకి వెళ్లాడు. ఆపై అక్కడి నుంచి దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శివను హాస్పిటల్కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. కాగా.. శివ 2015లో ఢిల్లీలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ట్రైనీ డాక్టర్గా ఉన్న టైంలో ఆయన మానసిక సమస్యలు, ఆందోళనతో బాధపడుతున్నారు. ఈ కారణాల వల్లే శివ సూసైడ్ చేసుకుని
ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.