తెలంగాణలో ఆరుగురు IASలు బదిలీ

తెలంగాణలో ఆరుగురు IASలు బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో పలు విభాగాల్లో పని చేస్తున్న IAS  అధికారులను బదిలీ చేశారు. ఈమేరకు రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ శాంత కుమారి శనివారం ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ ఛీఫ్ సెక్రటరీగా వికాస్ రాజ్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా డాక్టర్ శరత్, స్పోర్ట్స్ డైరెక్టర్ గా కొర్రా లక్ష్మీ, రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా హరీష్, మేడ్చల్ మల్కాజ్ గిర అడిషనల్ కలెక్టర్ గా రాధికా గుప్తా లను నియమించారు.