
ఇందల్వాయి, వెలుగు: మండలంలోని అన్సాన్పల్లి లో గురువారం అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికుల వివరాల ప్రకారం ఇందల్వాయి– ధర్పల్లి మెయిన్రోడ్డు సమీపంలో గల వరి చేలలో 6 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారు. వాటిలోని కాపర్వైర్, ఆయిల్ ఎత్తుకెళ్లారు. ఎండాకాలం ఓ పక్క భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక ఇబ్బంది పడుతున్న రైతులు.. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కావడంతో పొలాలు ఎలా పారించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్శాఖ ఆఫీసర్లు వీలైనంత త్వరగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.