ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారుల దాడులు

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారుల దాడులు

హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై దాడులు చేశారు.. రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు. శంషాబాద్ బెంగుళూరు- హైదరాబాద్ జాతీయ రహదారి తోపాటు.. పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 4 బస్సులపై కేసులు నమోదు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వస్తున్న 70 బస్సులను తనిఖీలు చేశారు అధికారులు. తెలంగాణ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న ఈస్ట్ వెస్ట్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల నుంచి అధిక చార్జీలు వసూల్ చేస్తే..కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రయాణీకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు.