దహెగాం, వెలుగు: ఓటేయాలంటే ఆ గ్రామస్తులు 6 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని ఖర్జి గ్రామపంచాయతీలోని గిరిజన గ్రామమైన లోహ గ్రామస్తులు ఆరు కిలోమీటర్ల దూరంలోని ఖర్జి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. సర్పంచ్అభ్యర్థులు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లో వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇక్కడ 100 శాతం ఓటింగ్ జరగడం విశేషం.
