ట్రంప్ తారీఫ్ల మోత..మెక్సికో,యూరప్లపై 30శాతం సుంకం

ట్రంప్ తారీఫ్ల మోత..మెక్సికో,యూరప్లపై 30శాతం సుంకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిజినెస్ పార్టినర్ దేశాలపై  తారిఫ్ ల మోత మోగిస్తున్నారు. ఇటీవల  కెనడా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాలపై సుంకాలను విధించిన ట్రంప్.. తాజాగా శనివారం (జూలై12) మెక్సికో, యూరోపియన్ యూనియన్ (EU) నుంచి దిగుమతులపై 30 శాతం సుంకాలను ప్రకటించారు. ఈ సుంకాలు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. 

కీలక వాణిజ్య మిత్రదేశాలైన మెక్సికో, EU లతో వారాల తరబడి జరిగిన చర్చలు జరిగినప్పటికీ సరియైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో విఫలమయ్యాయని ట్రంప్ చెప్పారు.ఆగస్టు 1 నుంచి యూరోపియన్ యూనియన్ (EU),మెక్సికో నుంచి దిగుమతులపై 30శాతం సుంకం విధిస్తున్నట్లు శనివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సోషల్ ట్రూత్ ద్వారా ఆ దేశాలకు లేఖలు పంపారు.  

మెక్సికోలో కార్టెల్‌లు ,ఫెంటానిల్ డ్రగ్ దిగుమతులను నియంత్రించడంలో విఫలమైనందుకు శిక్షగా మెక్సికోపై తారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.  మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ముఖ్యంగా కార్టెల్స్ (Cartels) ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టడంలో మెక్సికో వైఫల్యం చెందిందన్నారు ట్రంప్. 

►ALSO READ | ఆర్థిక కష్టాల్లో పాక్.. ఆసిమ్ మునీర్ లగ్జరీ విదేశీ పర్యటనలు.. సోషల్ మీడియాలో ప్రజల ఆగ్రహం!

మరోవైపు వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు EUపై సుంకాలు పెంచుతున్నామన్నారు ట్రంప్. ఒకవేళ ఈ దేశాలు ప్రతీకార సుంకాలు విధిస్తే అమెరికా వాటి కంటే ఎక్కువ సుంకాలతో స్పందిస్తుందని హెచ్చరించారు. ఇటీవల కెనడా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాలపై సుంకాలను విధించారు ట్రంప్. ఈ తాజా ప్రకటన ట్రంప్ వాణిజ్య విధానంలో ఒక భాగంగా ఉంది. ఈ చర్యలు గ్లోబల్ ట్రేడ్ వార్‌ను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది.

 ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.