వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు నిర్వహించిన ట్రంప్

వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు నిర్వహించిన ట్రంప్

అమెరికా: వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు జరిగాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా దీపం వెలిగించి భారతీయులకు.. భారతీయ అమెరికన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయుల ప్రముఖ పండుగ అయిన దీపావళిని వైట్ హౌస్ లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అక్కడి భారతీయ అమెరికన్లు అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఇవాళ దీపావళి సందర్భంగా అమెరికాలోని భారతీయులతో కలసి వేడుకలో పాలు పంచుకున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బ్రిటీష్ ప్రధాని కూడా ఇప్పటికే భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు. మరో వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వైట్ హౌస్ లో వేడుకలు నిర్వహించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన భారతీయులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తాను దీపావళిలో పాల్గొన్న ఫోటోలను ట్విట్టర్ లో కూడా షేర్ చేశారు ట్రంప్.