
ఒకవైపు భారత్ తమకు మిత్ర దేశం.. మోదీ మంచి మిత్రుడు అని చెప్పుకునే ట్రంప్.. మరోవైపు ఐ లవ్ పాకిస్తాన్.. అంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్ తో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం భారత్ తో సహా ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేంది. దీనిపై యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ వివరణ ఇచ్చారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ను ఎందుకు ఆహ్వానించాడో చెప్పారు.
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణంపై.. యుద్ధాన్ని తానే ఆపినట్లు ప్రకటించిన ట్రంప్.. పాక్ ఉగ్రవాదాన్ని అణచి వేయాలని పదే పదే చెప్పారు. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. కాల్పుల విరమణ కోసం పాక్ భారత్ ముందు మోకరిల్లింది. దీంతో ఇండియా సీజ్ ఫైర్ ను అమలు చేసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాల ముందు ఉంచింది భారత్. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టింది. ఇటువంటి సమయంలో ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ ను లంచ్ కు పిలవడం చర్చనీయాంశంగా మారింది.
భారత్-పాక్ మధ్య యుద్ధం వరకు వెళ్లకుండా ఆపాలని తాను కోరానని.. దానికి కట్టుబడి యుద్ధాన్ని ఆపినందుకు మునీర్ ను లంచ్ కు పిలిచినట్లు ట్రంప్ చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో ప్రసిడెంట్ లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరం అవుతున్న సందర్భంగా ఇరాన్ పై దాడికి దిగేందుకు అమెరికా భావిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇరాన్ కు మద్ధతిస్తున్న పాకిస్తాన్ తో ట్రంప్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
పాక్-ఇరాన్ మధ్య మైత్రి ఉండవచ్చు. ఇరాన్ పై మంచి అభిప్రాయం ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగున్న యుద్ధం నేపథ్యం ఏంటో పాకిస్తాన్ కు తెలుసు అని భావిస్తున్నాం. ఇరాన్ విశయంలో పాక్ ఆర్మీ చీఫ్ మాతో ఏకీభవించారు’’ అని చెప్పారు ట్రంప్.
అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఇప్పటికే పాక్ బహిరంగంగా ఖండించింది. ఇజ్రాయెల్ అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించిందని, ఇరాన్ కు తమ మద్ధతు ఉంటుందని ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ విషయంలో పాక్ ఆర్మీ చీఫ్ తమతో ఏకీభవించారు అనటం ఆలోచించాల్సిన విషయం.