
ట్రంప్కు స్వాగతం పలికేందుకు గంట ముందుగా ఎయిర్పోర్ట్కు వెళ్లి ఎదురు చూస్తున్నారు మోడీ.. అనుకున్న టైం కంటే 3 నిమిషాల ముందుగానే ల్యాండ్ అయ్యారు ట్రంప్.. ఎయిర్ఫోర్స్ 1 విమానం ల్యాండ్ అవ్వగానే మెలానియా, ట్రంప్ విమానం దిగుతూనే నవ్వుతూ చేతులూపారు. 8 వేల మైళ్లు ప్రయాణించిన అలసట లేకుండా నవ్వుతూ ప్రధాని మోడీని హగ్ చేసుకున్నారు. బ్లూ సూట్లో ట్రంప్, వైట్ డ్రెస్లో మెలానియా మెరిసిపోయారు. ఎప్పుడూ రెడ్ టై కట్టుకునే ట్రంప్ ఇండియా స్పెషలా అన్నట్టు ఎల్లో టై కట్టుకుని కనిపించారు. ఈ దంపతులకు మోడీతో పాటు జానపద కళాకారులు డ్యాన్సులతో.. వాయిద్యాలతో స్వాగతం పలికారు. తర్వాత ఇద్దరు నేతలు కలిసి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మోతేరా స్టేడియం వరకు 22 కిలోమీటర్ల మేర వేలాది మంది ప్రజల మధ్య రోడ్షో నిర్వహించారు. మధ్యలో సబర్మతి ఆశ్రమం వద్ద ఆగి పావుగంట సేపు గడిపారు. తర్వాత ‘నమస్తే ట్రంప్’ సభ గ్రాండ్గా జరిగింది. ఈ సభలో ‘ఇండియాను ప్రేమిస్తాం.. గౌరవిస్తాం’ అని ట్రంప్ అంటే.. ‘రెండు దేశాలు కలిసి పని చేస్తే మొత్తం దేశానికే గమ్యాన్ని చూపుతాయి’ అని మోడీ అన్నారు.
ట్రంప్ రావడానికి గంట ముందే ప్రధాని మోడీ అహ్మదాబాద్ చేరుకున్నారు.ఎయిర్ఫోర్స్ వన్ విమానం మూడు నిమిషాలు ముందుగానే ల్యాండ్ అయింది. షెడ్యూల్ టైమ్ 11.40 ప్రకారం రావాల్సి ఉండగా.. 11.37కే వచ్చేసింది.
బ్లూ రంగు సూట్ వేసుకుని, పసుపు రంగు టై కట్టుకుని ట్రంప్ వచ్చారు. ఆయన భార్య మెలానియా వైట్ జంప్ సూట్ వేసుకున్నారు. గోల్డ్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేసిన గ్రీన్సిల్క్ను కట్టుకున్నారు.
ట్రంప్ను ఆత్మీయంగా కౌగిలించుకుని మోడీ స్వాగతం పలికారు. మెలానియాకు షేక్హ్యాండ్ ఇచ్చారు. మొత్తంగా సోమవారం ట్రంప్ను మోడీ ఆరుసార్లు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
సబర్మతి ఆశ్రమంలో గాంధీ మహాత్ముడికి మోడీ దండం పెడుతుండగా.. ట్రంప్ దంపతులు ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు.ట్రంప్ మాట్లాడుతున్నంత సేపు మోడీ చప్పట్లు కొడుతూ కనిపించారు. మోడీ సంస్కరణలు చేస్తున్నాడంటూ చెప్పిన ట్రంప్.. మోడీవైపు తిరిగి చూశారు. దీంతో వెంటనే మోడీ కూర్చున్నచోటు నుంచే నవ్వుతూ నమస్తే పెట్టారు.స్టేడియంలోని సభా వేదికపై బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్తో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.