
అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమానికి వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ఏమీ తినలేదు. గుజరాత్ ఫేమస్ వంటకం ‘ఖామన్’ రుచి కూడా చూడలేదని సబర్మతి ఆశ్రమం ట్రస్టీ కార్తికేయ సారాభాయ్ చెప్పారు. ప్రెసిడెంట్గాని, ఆయన భార్యగాని, ఆశ్రమానికి వచ్చిన అమెరికన్టీమ్ మెంబర్లు ఎవరూ ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ నూ ముట్టుకోలేదని ఆయన అన్నారు.