
- రూ. 5 లక్షలు ఇస్తామని గతేడాది హామీ ఇచ్చిన క్రీడాశాఖ మంత్రి
హైదరాబాద్, వెలుగు: ఇండియా ఫుట్బాల్ ప్లేయర్, నిజామాబాద్కు చెందిన గుగులోత్ సౌమ్యకు ఆర్థిక సాయం చేయాలని నేషనల్ విమెన్స్ టీమ్ మేనేజర్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ జీపీ పాల్గుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్లో భాగంగా ఇటీవల కిర్గిజ్ రిపబ్లిక్లో జరిగిన రెండు మ్యాచ్ల్లో ఆడిన సౌమ్య రెండు గోల్స్తో ఆకట్టుకుంది. కానీ, రెండో మ్యాచ్ సందర్భంగా ఆమె కుడి కాలుకు ఫ్రాక్చర్ అవ్వడంతో టీమ్ నుంచి తప్పుకుంది.
ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న సౌమ్యను ఆదుకోవాలని పాల్గుణ రిక్వెస్ట్ చేశాడు. గతేడాది సౌమ్య ఏఎఫ్సీ కప్లో పాల్గొన్న తర్వాత ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, అప్పటి శాట్స్ చైర్మన్ హామీ ఇచ్చారన్నారు. కానీ, ఆమెకు ఇప్పటిదాకా ఎలాంటి సాయం అందలేదన్నారు.