
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేయాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. కాగా, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే.. 2025, మే7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు అల్టీమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 21 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టిన ఆర్టీసీ ఉద్యోగులు.. వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఆర్టీసీ సంస్థ ఇప్పటికే నష్టాల్లో ఉందని.. సమ్మె చేపట్టి సంస్థను మరింత దిగజార్చవద్దని ప్రభుత్వం చెప్పిన కార్మికులు వెనక్కి తగ్గలేదు. తాము ముందు చెప్పినట్లుగా మే 7 నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ జేఏసీ విధించిన డైడ్ లైన్కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటం.. సమ్మె విషయంలో వాళ్ల వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం (మే 6) ఆర్టీసీ జేఏసీతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపారు. చర్చలం సఫలం కావడంతో సమ్మె వాయిదా వేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. దీంతో మే 7 నుంచి యధావిధిగా బస్సులు తిరగనున్నాయి.
►ALSO READ | APPSC గ్రూప్ 1 పేపర్ స్కాం: క్యామ్ సైన్ డైరక్టర్ ధాత్రి మధు అరెస్ట్