
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ –3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల18 నుంచి జులై 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు జూన్ 6న షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, గ్రూప్ -3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించే ముందు గ్రూప్- 2 నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీపీఎస్సీ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం రాత్రి వెబ్నోట్ను తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. కొత్త షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు.