
హైదరాబాద్, వెలుగు: గురుకుల స్టూడెంట్లు గోల్ఫ్లో అదరగొడుతున్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)కు చెందిన గోల్ఫర్లు ఊటీలో జరిగిన సౌత్ జోన్ గోల్ఫ్ టూర్లో ఆరు మెడల్స్ తో మెరిశారు.
షేక్పేట్ స్కూల్లో చదువుతున్న మధు, న్యాల్కల్ స్టూడెంట్ ముకుల్ కేటగిరీ–బిలో గోల్డ్ మెడల్స్ నెగ్గారు. లింగంపేట స్కూల్ స్టూడెంట్ అయిన ప్రిసిల్లా కేటగిరీ–ఎలో గోల్డ్ సాధించగా.. నవీవ (సరూర్నగర్) సిల్వర్ నెగ్గింది. విఘ్నేష్ (చందూర్), ప్రగతి (ఆదిలాబాద్) కేటగిరీ–బి, ఎలో బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు.