తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది టీటీడీ. 182 గంటల వైకుంఠ ద్వార దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయించింది టీటీడీ. శుక్రవారం ( డిసెంబర్ 5 ) తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ మేరకు వివరాలు వెల్లడించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
డయల్ యువర్ ఈవో ముఖ్యాంశాలు:
- నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం.
- వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట
- డిసెంబర్ 30 నుండి జనవరి 08వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.
- పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164.15 గంటల సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయింపు.
- ఈ పది రోజులకు గానూ 7.70 లక్షల మంది భక్తులకు దర్శన ఏర్పాట్లు.
- డిసెంబర్ 30, 31, జనవరి 01 వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ.
- నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు దాదాపు 25 లక్షల మంది భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు.
- డిసెంబర్ 02వ తేదీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 1.70 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు కేటాయింపు.
- మొదటి మూడు రోజులు S.E.D., శ్రీవాణి దర్శనాలు రద్దు. మిగిలిన 7 రోజులకుగాను ఈరోజు (5వ తేదీ )ఉదయం 10 గం.లకు శ్రీవాణి దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గం.లకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తాం. (రోజుకు శ్రీవాణి దర్శనం - 1,000, SED - 15,000).
- జనవరి 02 నుండి 08వ తేదీ వరకు VQC - 2 ద్వారా భక్తులకు సర్వదర్శనం.
- ఈ 10 రోజులలో తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబడవు.
- ఈ 10 రోజులలో ప్రత్యేక దర్శనాలు రద్దు.
- స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం.
- దాతలకు సంబంధించిన టికెట్లను ఈ రోజు ఉదయం 10 గం.లకు ఆన్ లైన్ లో బుకింగ్ కు అవకాశం.
- జనవరి 6, 7, 8 తేదీలలో స్థానికుల దర్శనానికి డిసెంబర్ 10వ తేదీన ఆన్ లైన్ లో బుకింగ్ కు అవకాశం.
ఈ కార్యక్రమంలో టీటీడీ టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీ కృష్ణ, సిఈ శ్రీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
