తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ కళ్యాణ మండపాలు లీజుకు

తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ కళ్యాణ మండపాలు లీజుకు
  • 177 కళ్యాణ మండపాలు 5 ఏళ్లు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం

తిరుపతి: ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయించింది.ఆసక్తి కల హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు తమ ప్రతిపాదనలు పంపాలని టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆసక్తి కల వారు ఆన్ లైన్ ద్వారా తమ ప్రతిపాదనలతో దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ సూచించింది. 
ప్రతిపాదనలు పంపడానికి:  www.tender.apeprocurement.gov.in కు ప్రతిపాదనలు సమర్పించవచ్చు.
ఇతర వివరాలకు వెబ్ సైట్లు: 
 www.tirumala.org  లేదా www.tender.apeprocurement.gov.in
 లేదా  0877- 2264174, 22641745 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.