
అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఎస్–400 మిస్సైల్డిఫెన్స్సిస్టమ్ను టర్కీ దిగుమతి చేసుకుంటోంది. శనివారం ఎస్400 మిస్సైల్ ట్రక్స్ను మోసుకొచ్చిన నాలుగో కార్గో విమానం అంకారాలో దిగింది. అందులోంచి ట్రక్కులను దింపుతున్న ఫొటోను టర్కీ రక్షణ మంత్రి ట్వీట్చేశారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డిఫెన్స్ సిస్టమ్ వచ్చేసిందని కామెంట్చేస్తూ ఈ ఫొటోను షేర్చేశారు. రష్యాతో టర్కీ కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా మండిపడుతోంది. ఆ డీల్ను కేన్సల్ చేసుకోవాలని పదే పదే హెచ్చరించింది. నాటో సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించినా టర్కీ లెక్క చేయలేదు. రక్షణ శాఖకు అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవడం తమ దేశపు హక్కులకు సంబంధించిన విషయమని, ఎవరి బెదిరింపులకు తలొగ్గేదిలేదని స్పష్టంచేసింది.