ట్విటర్​ కొత్త సీఈఓ జీతం ఎన్ని కోట్లో తెలుసా ?

ట్విటర్​ కొత్త సీఈఓ జీతం ఎన్ని కోట్లో తెలుసా ?

న్యూఢిల్లీ; ట్విటర్​ కొత్త సీఈఓ పరాగ్​ అగర్వాల్​ ఏటా రూ. 7.5 కోట్ల (మిలియన్​ డాలర్ల) జీతం అందుకోనున్నారు. 2011లో ట్విటర్​లో జాయినయిన పరాగ్​ అగర్వాల్​ 2017లో సీటీఓగా ప్రమోట్​ అయ్యారు. ట్విటర్​ టెక్నికల్​ స్ట్రాటజీలో పరాగ్​ అగర్వాల్​దే ముఖ్యమైన పాత్ర. జీతానికి అదనంగా 150 % బోనస్​ కూడా ఉంటుందని ట్విటర్​ తెలిపింది. 1.25 కోట్ల స్టాక్​ ఆప్షన్లను కంపెనీ ఆయనకు ఇస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 16 ఈక్వల్​ క్వార్టలీ ఇంక్రిమెంట్లుగా పరాగ్​ ఈ షేర్లను పొందవచ్చని ట్విటర్​ యూఎస్​ ఎస్​ఈసీకి వెల్లడించింది.