లడఖ్ను చైనాలో చూపినందుకని ఎంపీ మీనాక్షి లేఖి వెల్లడి
న్యూఢిల్లీ: లడఖ్ను చైనాలో చూపించిన అంశంపై ట్విట్టర్ మన దేశానికి సారీ చెప్పింది. ఈ నెల 30 నాటికి తప్పును సరిదిద్దుకుంటామని పార్లమెంటరీ ప్యానల్కు వివరించిందని ఎంపీ, ప్యానల్ చైర్పర్సన్ మీనాక్షి లేఖి అన్నారు. ట్విట్టర్ లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పిందని ఆమె చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ఐఎన్సీ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డమైన్ కరియన్ అఫిడవిట్ రూపంలో క్షమాపణలు పంపారు. “ఇండియన్ల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు. ఈ నెల 30 నాటికి తప్పును సవరించుకుంటాం” అని దాంట్లో చెప్పారు. లడఖ్ చైనాలో భాగం అంటూ ట్విట్టర్ చూపించడంపై పార్లమెంటరీ ప్యానెల్ గతంలో ట్విట్టర్కు వార్నింగ్ ఇచ్చింది. దానిపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ అంశంపై ట్విట్టర్ ఐఎన్సీ సభ్యులను దాదాపు రెండు గంటల పాటు విచారించింది.
Read more news
కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ