నిజామాబాద్, వెలుగు: రెండు ఏటీఎంలను దొంగలు గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి రూ.38 లక్షలు ఎత్తుకెళ్లారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ సిటీలోని ఆర్యానగర్లో ఉప్పల మల్లయ్య పెట్రోల్ బంక్ పక్కనున్న డీబీఎం బ్యాంక్ ఏటీఎంలోకి శనివారం తెల్లవారుజామున 3 గంటలకు దొంగలు ప్రవేశించారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా స్ర్పే కొట్టారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎం తెరిచి అందులో ఉన్న రూ.26 లక్షలు తీసుకున్నారు. తరువాత వర్ని చౌరస్తాకు చేరువలోని ఎస్బీఐ ఏటీఎంలోకి వెళ్లారు.
అక్కడ కూడా గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి రూ.11.59 లక్షలు అపహరించారు. మొత్తంగా రూ.38 లక్షలతో ఉడాయించారు. రెండు చోట్ల అలారమ్స్ పనిచేయకపోవడంతో బ్యాంకర్లకు తెలియలేదు. గ్యాస్ కట్టర్ వల్ల ఆర్యనగర్ ఏటీఎంలో మంటలు లేచాయి. దీంతో పక్కింటి వ్యక్తి విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కామారెడ్డి ఇన్చార్జి సీపీ రాజేశ్చంద్ర చోరీ జరిగిన స్థలాలను పరిశీలించారు. దొంగలను పట్టుకోడానికి స్పెషల్ టీంలను రంగంలోకి దింపారు.
