కోహ్లీకి రెండు.. రోహిత్​కు మూడో ర్యాంక్​

కోహ్లీకి రెండు.. రోహిత్​కు మూడో ర్యాంక్​

దుబాయ్​: టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో వరుసగా రెండు, మూడు ర్యాంక్​లను సాధించారు. ప్రస్తుతం వీళ్ల ఖాతాలో  వరుసగా 857, 825 పాయింట్లున్నాయి. పాకిస్తాన్​ కెప్టెన్​ బాబర్​ ఆజమ్ (865) టాప్​ ర్యాంక్​లో కొనసాగుతుండగా, రాస్​ టేలర్​ (801), ఆరోన్​ ఫించ్​ (791) 4,5 ప్లేస్​ల్లో నిలిచారు. కోహ్లీ, రోహిత్​ మినహా.. ఇండియా నుంచి టాప్​–10లో ఒక్కరు కూడా లేరు. ఇక బౌలింగ్​ ర్యాంకింగ్స్​లో జస్​ప్రీత్​ బుమ్రా (690) ఐదో ర్యాంక్​లో ఉండగా, ట్రెంట్​ బౌల్ట్​ (737) టాప్​ ప్లేస్​ను నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్​ ఆఫ్​ స్పిన్నర్​ మెహిదీ హసన్​ (725) ఫస్ట్​ టైమ్ సెకండ్​  ర్యాంక్​లో నిలిచాడు. ​ శ్రీలంకతో జరుగుతున్న వరల్డ్​కప్​ సూపర్​ లీగ్​ సిరీస్​ల్లో రాణించడం హసన్​కు కలిసొచ్చింది. 2009లో ఆల్​రౌండర్​ షకీబ్​ అల్​ హసన్​.. తొలిసారి ఫస్ట్​ ర్యాంక్​లో నిలవగా, 2010లో లెఫ్టార్మ్​ స్పిన్నర్​ అబ్దుర్​ రజాక్​ సెకండ్​ ర్యాంక్​ను సాధించాడు. అఫ్గానిస్తాన్​ స్పిన్నర్​ ముజీబుర్​ రెహమాన్​ (708) థర్డ్​ ప్లేస్​కు పడిపోయాడు. మ్యాట్​ హెన్రీ (691) నాలుగో ర్యాంక్​లో ఉండగా, రబాడ (666), క్రిస్​ వోక్స్​ (665), హాజిల్​వుడ్​ (660), ముస్తాఫిజుర్​ ​ (652), కమిన్స్​ (646) వరుసగా ఆరు నుంచి పది ర్యాంక్​ల్లో ఉన్నారు.