ఎదురెదురుగా ఢీకొన్న సూపర్ ఫాస్ట్ రైళ్లు

ఎదురెదురుగా ఢీకొన్న సూపర్ ఫాస్ట్ రైళ్లు

ఇటలీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.  ఎదురెదురుగా వస్తున్న రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు  వేగంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి.  ఈ ఘటనలో  17 మంది ప్రయాణికులు గాయపడ్డారు.   అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు.  అయితే తక్కువ వేగంలో వెళ్తుండగా రెండు రైళ్లు ఢీకొట్టుకోవడంతో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని రైలు ఆపరేటర్‌ చెప్పారు. 

 బోలోగ్నా, రిమిని మధ్య లైన్‌లో ఎదురెదురుగా వస్తున్న హై-స్పీడ్ రైలు, ప్రాంతీయ రైలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన ఫెన్జా నగరం, ఫోర్లి కమ్యూన్ మధ్య చోటు చేసుకుంది.   ఢీ కొట్టుకున్న  రైళ్లలో హై స్పీడ్‌ రైలు ముందుభాగం నుజ్జునుజ్జవగా ఎక్స్‌ప్రెస్‌ రైలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. 

ఈ సంఘటనపై  ఇటలీ ఉప ప్రధాని.  రవాణా మంత్రి మాటియో సాల్విని మాట్లాడుతూ తాను పరిస్థితిని సమీక్షిస్తున్నానని, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.  ఏమి జరిగిందనే దానిపై వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులను  కోరారు.