ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం

ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం

మేడ్చెల్ జిల్లా : కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. వద్ద టోల్ ప్లాజా 8 వ నెంబర్ వద్ద  ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.మరొకరికి తీవ్ర గాయాలు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న కీసర పోలీసులు.ఖమ్మం నుండి అల్వాల్ వెళ్తుండగా కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు శంకర్ రెడ్డి,సుమంత్ రెడ్డిగా గుర్తించారు.గాయాలు అయిన వ్యక్తి తరుణ్.తరుణ్ ని నగరంలోని ఆస్పత్రికి తరలిచిన పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. మృతులు అల్వాల్ కు చెందిన వారిగా గుర్తించారు.