
- మాక్లూర్లో పూడ్చిన ప్రసాద్ శవం వెలికితీత
- నవీపేట యంచ గోదావరి ఒడ్డున దొరికిన శాన్విక శవం
కామారెడ్డి/ నిజామాబాద్, వెలుగు : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసులో మరో రెండు డెడ్బాడీలను గురువారం పోలీసులు గుర్తించారు. హత్యలతో సంబంధమున్న ముగ్గురిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు శవాలను ఐడెంటిఫై చేశారు. నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండలం మదన్పల్లిలో పూనె ప్రసాద్శవాన్ని తవ్వి తీయించిన పోలీసులు..డాక్టర్లతో అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించారు. ప్రసాద్కు మద్యం తాగించి చంపిన నిందితులు అక్కడే పూడ్చిపెట్టారు. తర్వాత నవీపేటలోని యంచ గ్రామం పక్కన ఉన్న గోదావరి ఒడ్డున ప్రసాద్ భార్య శాన్విక అలియాస్రమణి డెడ్బాడీని గుర్తించారు. పూర్తిగా కుళ్లిన స్థితిలో ఆమె శవం లభ్యమైంది.
మాక్లూర్ లోని పూనె ప్రసాద్ ఇంటిపై లోన్ ఇప్పిస్తానని నమ్మించిన అతడి స్నేహితుడు ప్రశాంత్ఆ ఇంటిని తన పేరుపై మార్చుకున్నాడు. తర్వాత ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం ఆరుగురు కుటుంబీకులను వేర్వేరు ప్రాంతాల్లో హత్య చేశాడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను ఈ నెల19న కామారెడ్డి జిల్లా సదాశివ్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. పూనె ప్రసాద్తో పా టు ఇతడి భార్య శాన్విక అలియాస్ రమణి, కవల పిల్లలు చైత్రిక్, చైత్రిక, చెల్లెళ్లు శ్రావణి, స్వప్న హత్యకు గురికాగా, చైత్రిక్, చైత్రిక, శ్రావణి, స్వప్న డెడ్బాడీలను ఇదివరకే గుర్తించారు. తాజాగా నిందితుడు ప్రశాంత్, ఇతడికి సహకరించిన వంశీ, విష్ణులు ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన రెండు మృతదేహాలను కనుగొన్నారు. తహసీల్దార్ జాకీర్ సమక్షంలో సీఐ సతీశ్, ఎస్ఐ సుధీర్ శవాలకు పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు.