బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం ముత్తాపూర్ సర్పంచ్గా ఎండీ మున్నాబి, కాసిపేట మండలంలో ధర్మారావుపేట సర్పంచ్గా జూగునాక రాధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముత్తాపూర్లో సర్పంచ్ స్థానానికి ఒకే నామినేషన్ వేయడంతో పాటు మొత్తం 8 వార్డులకు ఒక్కొక్క నామినేషన్ వచ్చాయి.
దీంతో వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ధర్మారావుపేటలో సర్పంచ్తో పాటు మొత్తం 7 వార్డులకు గానూ 4 స్థానాలకు ఒక్కో నామినేషన్వచ్చింది. దీంతో ఆ నలుగురు సభ్యలు కూడా ఏకగ్రీవమయ్యారు.
