జాతీయస్థాయి పోటీలకు ఆదర్శ విద్యార్థులు ఎంపిక

జాతీయస్థాయి  పోటీలకు ఆదర్శ  విద్యార్థులు ఎంపిక

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ స్కూల్, కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ అబ్దుల్ ఖలీల్ వెల్లడించారు.

తెలంగాణ నెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్​లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన టెన్త్ ​క్లాస్ విద్యార్థి మేకర్తి వంశీవర్ధన్, ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్ జంజిరాల అజయ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు హరియాణాలో జరగనున్న నెట్ బాల్ ఫెడరేషన్ కప్ ఛాంపియన్​ షిప్ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులను నెట్ బాల్ జిల్లా అధ్యక్షులు అలిబిన్ అహ్మద్, పీడీ బి.తిరుపతి, టీచర్లు సన్మానించారు.