ఇద్ద‌రు మ‌హిళ‌ల ఆత్మ‌హ‌త్య.. ప‌క్క‌నే మ‌రో చిన్నారి మృత‌దేహం

ఇద్ద‌రు మ‌హిళ‌ల ఆత్మ‌హ‌త్య.. ప‌క్క‌నే మ‌రో చిన్నారి మృత‌దేహం

మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో ఇద్దరు మహిళల‌తో స‌హ ఒక పాప మృతి చెంద‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. జ‌వహార్ నగర్ లో చెట్లకు ఉరి వేసుకుని శ్రీరాముల అనూష, అరికెల సుమతి అనే ఈ ఇద్ద‌రు మ‌హిళ‌లు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామ పరిధిలోని శాంతి నగర్ కు చెందిన సుమతి ఐదేండ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లి పోయి జ్యోతి నగర్ లో ఉంటుంది. ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండే అనూష, సుమతి ఇద్దరు బీజేపీ మహిళా మోర్చా విభాగంలో పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా పేదలకు ఆహారం, నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం ఉదయం వెళ్లిన వీరు.. ఆ తరవాత కనిపించలేదు. ఈ రోజు జవహర్ నగర్ లో చెట్లకు వేలాడుతూ జీవచ్చాలుగా కనిపించారు. వారికి మ‌రి కొద్ది దూరంలో పాప మృత‌దేహం ప‌డి ఉంది.

అయితే దేశ‌మంతటా విధించిన లాక్‌డౌన్ కార‌ణంగానే వీరు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు స‌మాచారం. రేషన్ కోసం నిలబడి ఆలస్యంగా ఇంటికి వెళ్లిన మహిళలు తమ భర్తల మందలింపుతో మనస్తాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు తెలిసింది. అంత‌కుముందు అనూష త‌న‌ కూతురు అర్హకు కూల్ డ్రింకులో హార్పిక్ కలిపి ఇచ్చింది. పాప చనిపోయింద‌ని నిర్ధారించుకున్నాక వీరిద్ద‌రూ చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు.

దేశమంతా లాక్ డౌన్ ఉంది. అడుగు బయట పెట్టాలంటేనే ఇబ్బందిగా ఉన్న ఈ స్థితిలో వీరు ఎలా జవహర్ నగర్ కు వెళ్లారనే అనుమానాలు వస్తున్నాయి. వీరి భర్తలు మృతదేహాలను తీసుకురావడానికి మేడ్చల్ కు వెళ్లారు.