చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు  నిషాన్ ఘాట్ వాగులో గల్లంతయ్యారు.  పట్టణానికి చెందిన యువకులు నిశాన్ ఘాట్ వాగు వద్ద చేపలు పట్టడానికి వెళ్లారు. వీరిలో ఒక యువకుడు చేపలు పట్టే ప్రయత్నంలో వాగులో  గల్లంతయ్యాడు. తోటి మిత్రుడు అతడిని రక్షించే ప్రయత్నంలో మరో యువకుడు కూడా గల్లంతయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టారు.

ALSO READ | బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు..

మరో వైపు ఆదిలాబాద్ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు పలు ఏరియాల్లో వరద ప్రవాహం పెరిగి వాగులు పొంగిపొర్లుతున్నాయి.  ఈక్రమంలో పలు నియోజకవర్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల సరైన రోడ్లు లేక వాగులు వరదలకు  ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకపోయింది. అంతేగాక పొచ్చేరా, కుంటాల వాటర్ ఫాల్స్ లకు వరద ప్రవాహం పెరిగింది.

మరో వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.