ఏఐ మిస్టేక్.. చరిత్రలోనే రెండో అతిపెద్ద జరిమానా: ఉబర్‎కు రూ.9 వేల 244 కోట్ల పెనాల్టీ

ఏఐ మిస్టేక్.. చరిత్రలోనే రెండో అతిపెద్ద జరిమానా: ఉబర్‎కు రూ.9 వేల 244 కోట్ల పెనాల్టీ

ఆమ్​స్టర్​డామ్: ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా డ్రైవర్ల అకౌంట్లను తొలగించిన క్యాబ్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ కంపెనీ ఉబర్‌‌‌‌కు నెదర్లాండ్స్​డేటా ప్రొటెక్షన్ అథారిటీ 825 మిలియన్ల యూరోల (దాదాపు రూ.9,244.67 కోట్ల) పెనాల్టీ వేసింది. మనుషుల పర్యవేక్షణ లేకుండా ఏఐ టెక్నాలజీల ద్వారా డ్రైవర్లను తీసేయడం నిబంధనలకు విరుద్ధమని రెగ్యులేటర్ స్పష్టం చేసింది. ఫ్రాన్స్‎కు చెందిన 170 మంది డ్రైవర్లు ఉబర్​నిర్ణయాలపై ఫిర్యాదు చేశారు. 

డిజిటల్ రైట్స్ సంస్థ సహాయంతో వీరు నెదర్లాండ్స్‌‌‌‌లోని ఉబర్ యూరోపియన్ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌ నుంచి వివరాలు సేకరించారు. 2019లో మొదలైన ఈ వివాదం ఇప్పుడు చరిత్రలోనే రెండో అతిపెద్ద జరిమానాగా మారింది. కంప్యూటర్లే ఉద్యోగాలను తీసేయడం సరికాదని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ తీర్పును ఉన్నతస్థాయిలో సవాలు చేస్తామని ఉబర్ స్పష్టం చేసింది. అమెరికా టెక్ కంపెనీలపై యూరప్ ​విధిస్తున్న ఇలాంటి జరిమానాలు చర్చకు దారితీస్తున్నాయి.