కరీంనగర్ సిటీ, వెలుగు: బ్యాంకు వినియోగదారులకు డిజిటల్ సౌకర్యం కల్పిస్తున్నామని యూబీఐ ప్రాంతీయ అధికారి అపర్ణరెడ్డి, ఉప ప్రాంతీయ అధికారి సురేశ్ అన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 107వ స్థాపన దినోత్సవాలను కరీంనగర్లోని ప్రతిమ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు వినియోగదారులకు అవసరాలకు అనుగుణంగా నూతన విధానాలను ప్రవేశ పెడుతున్నామన్నారు. వినియోగదారులు వందేళ్లకు పైగా విశ్వాసం ఉండటంతో వివిధ సేవలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వినియోగదారులు పాల్గొన్నారు.
