ఉడాన్ 5.0 కింద ​ ఎయిర్‌‌లైన్స్ నుంచి బిడ్స్​ పిలుస్తున్న మినిస్ట్రీ

ఉడాన్ 5.0 కింద ​ ఎయిర్‌‌లైన్స్  నుంచి  బిడ్స్​ పిలుస్తున్న మినిస్ట్రీ

న్యూఢిల్లీ: దేశంలోని మరిన్ని సుదూర ప్రాంతాలకు విమానయానం అందుబాటులోకి తేవడానికి ఉడాన్​5.0 ను లాంఛ్​ చేశారు. ఈ కొత్త రూట్ల కోసం బిడ్స్​ పిలిచే ప్రక్రియను సివిల్​ ఏవియేషన్ మినిస్ట్రీ మొదలెట్టింది. 20 నుంచి 80 సీట్లుండే కేటగిరీ 2, 80 సీట్ల కంటే ఎక్కువుండే కేటగిరీ 3 మాత్రమే ఈ 5 వ రౌండ్​ ఉడాన్​లో ఉంటాయని మినిస్ట్రీ ఒక ట్వీట్​లో తెలిపింది. ఒరిజిన్​, డెస్టినేషన్​ల మధ్య దూరంపై ఈసారి ఎలాంటి పరిమితులనూ పెట్టడంలేదని పేర్కొంది. ఎయిర్​లైన్స్​ కంపెనీలు ఇచ్చే  నెట్​వర్క్, ఇండివిడ్యువల్​ రూట్​ ప్రపోజల్స్ ​మాత్రమే పరిగణిస్తామని మినిస్ట్రీ ఈ ట్వీట్​లో  వెల్లడించింది. లెటర్​ ఆఫ్​ ఆథరైజేషన్​ వచ్చిన రెండు నెలల్లో ఎయిర్​లైన్స్​ కంపెనీలు తమ బిజినెస్​ ప్లాన్​ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. రూట్​ అవార్డు చేసినప్పటి నుంచి 4 నెలల లోపు ఆపరేషన్స్​ను ఎయిర్​లైన్స్​ కంపెనీలు ప్రారంభించాల్సి ఉంటుందని వివరించింది.

గతంలోని రౌండ్లలో ఈ గడువు ఆరు నెలలుగా ఉండేది. ఆపరేషన్​కు రెడీగా ఉన్న ఎయిర్​పోర్టులు, లేదా త్వరలోనే రెడీ అయ్యే ఎయిర్​పోర్టుల లిస్ట్​ను స్కీములో చేర్చినట్లు మినిస్ట్రీ తెలిపింది. చాలా ప్రాంతాలలో ఉడాన్​ మంచి మార్పు తీసుకొచ్చింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో మెరుగైన కనెక్టివిటీని కల్పించిందని సివిల్​ ఏవియేషన్​ మినిస్టర్​ జ్యోతిరాదిత్య సిందియా ఒక స్టేట్​మెంట్​లో చెప్పారు. మెరుగైన మార్పులతో తెచ్చిన కొత్త ఉడాన్​ స్కీము మొమెంటమ్​ను పెంచుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 1000 రూట్లు, 50 అదనపు ఎయిర్​పోర్టులు, హెలిపోర్టులు, వాటర్​ ఏరోడ్రోమ్స్​ ఆపరేషన్​లోకి తేవాలనే తమ టార్గెట్​ను ఈ స్కీము దగ్గర చేస్తుందని అన్నారు.