గాజుల అలంకరణలో ఉజ్జయిని మహంకాళి

గాజుల అలంకరణలో  ఉజ్జయిని మహంకాళి

శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా సికింద్రాబాద్​లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించారు. మాణిక్యాలమ్మగా గాజుల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాన్ని సైతం గాజుల తోరణాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు – వెలుగు, పద్మారావునగర్