వచ్చేవారం భారత్ పర్యటనకు బ్రిటన్ ప్రధాని

వచ్చేవారం భారత్ పర్యటనకు బ్రిటన్ ప్రధాని

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్చే వారం భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెల 21 న అహ్మదాబాద్ నుంచి ఆయన టూర్ ప్రారంభం కానుంది. 22 న న్యూఢిల్లీలో  ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో వివిధ అంశాలపై  చర్చించనున్నారు. యూకే, భారత్ మధ్య వ్యూహాత్మక రక్షణ, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యంపై ఇద్దరు నేతలు డిస్కస్ చేయనున్నారు. అయితే ఉక్రెయిన్ యుద్ధం, ఐక్యరాజ్య సమితిలో ఇండియా ఓటింగ్ విధానం, రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు వంటి అంశాలను బోరిస్ జాన్సన్ ప్రస్తావించే అవకాశముంది. ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధి, రక్షణ వ్యవహారాల్లో భారత్, యూకేల మధ్య సంబంధాల బలోపేతానికి తన పర్యటన ఉపయోగపడుతుందని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

మరిన్ని వార్తల కోసం

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఈ ఊళ్లో ఉప్పు గని ఉంది