రెండో ఫేజ్​ యుద్ధం మొదలైంది​

రెండో ఫేజ్​ యుద్ధం మొదలైంది​

కీవ్: ఉక్రెయిన్​లో రష్యా అరాచక దాడులు మళ్లీ మొదలయ్యాయని, యుద్ధంలో ఇది రెండో ఫేజ్​ అని జెలెన్​స్కీ మండిపడ్డారు. ఖార్కివ్​పై రష్యా బాంబుల వర్షం కురిపించడంతో ఐదుగురు పౌరులు చనిపోగా, మరో 17 మంది గాయపడ్డారని వివరించారు. కీవ్​ను స్వాధీనం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో డాన్​బాస్​ రీజియన్​పై రష్యా కన్నేసింది. ఇండస్ట్రియల్​ సెక్టార్​కు కీలకమైన ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడం ద్వారా తమ పట్టు నిరూపించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉక్రెయిన్​ తూర్పువైపున ఉన్న నగరాలు, పట్టణాలపై దాడుల తీవ్రతను పెంచింది. దీంతో యుద్ధం మరో దశకు చేరుకుందని రెండు దేశాల అధికార వర్గాలు చెబుతున్నాయి. మరియుపోల్​లోని ఉక్రెయిన్​ సైనికులు వెంటనే ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని రష్యా రక్షణ శాఖ  మళ్లీ హెచ్చరించింది.