ఒంటరితనం భరించలేక యువకుడు ఆత్మహత్య

ఒంటరితనం భరించలేక యువకుడు ఆత్మహత్య

హసన్‌‌‌‌పర్తి, వెలుగు : ఒంటరితనం భరించలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్‌‌‌‌పర్తి మండలం మడిపల్లిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన ముంజా రాజేశ్‌‌‌‌ (28)కు చింతగట్టుకు చెందిన యువతితో కొన్నేళ్ల కింద పెండ్లి జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొన్ని నెలల కింద విడిపోయారు.

అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో ఉండకుండా ఒంటరిగానే ఉంటున్నాడు. దీంతో ఒంటరితనం భరించలేక బుధవారం వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి రాజేశ్‌‌‌‌ను హాస్పిటల్‌‌‌‌కు తరలించగా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ చనిపోయాడు.