- గవర్నర్ తమిళిసై
- శిల్పారామంలో ఒడిశా ఉత్సవాలు
మాదాపూర్, వెలుగు : గొప్ప సంస్కృతి, హస్తకళలు ఒడిశా సొంతమని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. మాదాపూర్లోని శిల్పారామంలో స్వాభిమాని ఒడియా పరివార్ హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో ఒడిశాకు చెందిన చేనేత హస్తకళా, ఫుడ్, కల్చరల్ ఉత్సవంలో శనివారం గవర్నర్ ముఖ్య అతిథిగా పాలొని మాట్లాడారు.
దేశమొదటి పౌరురాలు రాష్ర్టపతి ద్రౌపది ముర్ము ఒడిశా నుంచి వచ్చారని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణలో నివసించే ఒడిశా వాసులు తెలుగు నేర్చుకోవాలని, ఇక్కడి సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు.
అనంతరం చేనేత హస్తకళ, ఫుడ్ స్టాల్స్ను సందర్శించారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్ మురళిధర్రావు, ఒడియా పరివారీ ప్రెసిడెంట్ సుస్మిత మిశ్ర, అర్చన మిశ్రా, డీకే మహంతి, ఒడిశాకు చెందిన పలువురు పాల్గొన్నారు.