అర్థరాత్రి అమరావతి ఆలయంలో దొంగలు.. రూ. 10 వేలతో ఉడాయించారు

అర్థరాత్రి అమరావతి ఆలయంలో దొంగలు..  రూ. 10 వేలతో ఉడాయించారు

ఏపీలోని పల్నాడు జిల్లా అమరావతిలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అర్థరాత్రి  ఆలయంలోకి చొరబడి రూ.10 వేలతో ఉడాయించారు.  ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇందులో నిందితుల్లో ఒకరు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న క్షేత్ర బాల చాముండికా ఆలయ ప్రాంగణంలోకి చొరబడిన వ్యక్తులు హుండీని ధ్వంసం చేసి రూ.10వేలు అపహరించారు. దీనిపై ఆలయ అధికారలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  

2022లో హుండీ లెక్కింపు సందర్భంగా కనకదుర్గ గుడిలో బంగారు ఆభరణాలు దొంగిలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు కగ్గా పుల్లారావు (51) ఆలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. హుండీ లెక్కింపు సమయంలో పుల్లారావు బంగారు ఆభరణాలను దొంగిలించి తిరిగి ఇంటికి వచ్చేసరికి తీసుకువెళ్తామని బాత్‌రూమ్‌లో ఉంచాడు.