
కోడేరు, వెలుగు: స్కూల్స్ రీ ఓపెన్ అయ్యి నెల రోజులు కావస్తున్నా మండలంలోని రాజాపూర్ హైస్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయలేదు. స్కూల్లో 127 మంది విద్యావిద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి స్కూల్ రీ ఓపెనింగ్ రోజే యూనిఫాం అందజేయాల్సి ఉండగా, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారి పేరెంట్స్ వాపోతున్నారు.
ఆర్థిక పరిస్థితి సరిగా లేని పేరెంట్స్ తమ పిల్లలను పాత బట్టలతోనే తమ పిల్లలను బడికి పంపిస్తున్నారు. తమ పిల్లలకు వెంటనే యూనిఫాం అందజేయాలని పేరెంట్స్ కోరుతున్నారు. ఈ విషయమై ఎంఈవో భాస్కరశర్మను వివరణ కోరగా, 40 డ్రెస్సులు వచ్చాయని, మిగతావి వచ్చాక విద్యార్థులకు పంపిణీ చేస్తామని తెలిపారు.